- ఇండియాలో రూ. 10.99 లక్షల (ఎక్స్-షోరూమ్) తో పంచ్ ఈవీ ధరలు ప్రారంభం
- 421 కిలోమీటర్లు వరకు ఏఆర్ఏఐ-క్లెయిమ్డ్ రేంజ్ లభ్యం
టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ పంచ్ ఈవీని ఇటీవలే లాంచ్ చేసిన విషయం తెలిసిందే, ఇండియాలో దీనిని రూ. 10.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఇది 5 వేరియంట్స్ లో అందుబాటులో ఉంది:- అవి స్మార్ట్, స్మార్ట్ +, అడ్వెంచర్, ఎంపవర్డ్ మరియు ఎంపవర్డ్+ అంతేకాకుండా, సబ్- 4 మీటర్ల ఎలక్ట్రిక్ ఎస్యువిని రూ. 21,000 టోకెన్ అమౌంట్ తో బుక్ చేసుకోవచ్చు. పంచ్ ఈవీ యొక్క డెలివరీలు 22 జనవరి 2024న ప్రారంభమవుతాయి.
టాటా మోటార్స్ న్యూ పంచ్ ఈవీలో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఉన్నాయి:- అవి 25kWh మరియు 35kWh, దీనితో పాటు ఏఆర్ఏఐ-క్లెయిమ్డ్ రేంజ్ 315కిమీ మరియు 421కిమీ వరకు పొందవచ్చు. అలాగే, మొదటిది 80bhp మరియు 114Nm టార్క్ను ఉత్పత్తి చేసేందుకు మోటార్ తో సహకరించగా, రెండోది 120bhp మరియు 190Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.
ఫీచర్ల విషయానికివస్తే, సిట్రోన్ eC3తో పోటీగా కొనసాగే ఇందులో టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ మధ్యలో ఒక ఇల్యూమినేటెడ్ లోగో ఉండగా, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ కోసం వేరువేరుగా డ్యూయల్ 10.25- ఇంచ్ స్క్రీన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఆటో హోల్డ్, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, రెయిన్-సెన్సింగ్ వైపర్స్, ఏక్యూఐ డిస్ప్లే ఎయిర్ ప్యూరిఫైయర్ మరియు లెథెరెట్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు కూడా ఉన్నాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప