- మూడు లక్షలకు పైగా వెహికిల్స్MQB-A0-IN ప్లాట్ ఫారంపై తయారీ
- మొత్తం ఎగుమతిలో 30 శాతం మేడ్-ఇన్-ఇండియా ద్వారా వచ్చినవే
స్కోడా ఆటో ఫోక్స్వ్యాగన్ ఇండియా గ్రూప్ చకాన్, పూణే ప్లాంట్ వద్ద 2009 సంవత్సరం నుంచి 15 లక్షలకు పైగా కార్లను ఉత్పత్తి చేసి ఒక కొత్త మైల్స్టోన్ ని సాధించింది. ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయిన పలు మోడళ్లలో స్కోడా ఫేబియా, స్కోడా ర్యాపిడ్, ఫోక్స్వ్యాగన్ పోలో, ఫోక్స్వ్యాగన్ పోలో, ఫోక్స్వ్యాగన్ వెంటో ఉండగా, ఇతర కొత్త మోడల్స్ MQB ప్లాట్ ఫారంపై తయారుచేయబడ్డాయి.
ప్రస్తుతానికి, MQB-A0-INప్లాట్ ఫారంపై తయారుచేయబడ్డ వెహికిల్స్ లో స్కోడా కొడియాక్ మరియు స్లావియా, మరియు ఫోక్స్వ్యాగన్ వర్టూస్ మరియు టైగున్ ఉన్నాయి. మొత్తం మీద ప్రొడక్షన్ మైల్స్టోన్ పరంగా చూస్తే, కేవలం ఈ మోడల్స్ మాత్రమే 3 లక్షలకు పైగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, చకాన్ ప్లాంట్ 3.8 లక్షలకు పైగా ఇంజిన్లను తయారుచేయగా, అందులో మోస్ట్ పాపులర్ గా ఉన్న 1.0-లీటర్ టిఎస్ఐ ఇంజిన్ ఉన్నాయి.
ఇంకా చెప్పాలంటే, ఫోక్స్వ్యాగన్ గ్రూప్ 30 శాతం ఇండియా-మేడ్ వెహికిల్స్ ని 40 దేశాలకు ఎగుమతి చేసింది. గ్లోబల్ మార్కెట్లో ఈ బ్రాండ్ మేకింగ్ ఇండియా ద్వారా నాలుగవ అతి పెద్ద ఎగుమతుల కేంద్రంగా నిలిచింది.
ఈ సందర్భంగా ఎస్ఎవిడబ్లూఐపిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ పీయూష్ అరోరా మాట్లాడుతూ, “మా చకాన్ ప్లాంట్లో 15 లక్షలకు పైగా వెహికిల్స్ ఉత్పత్తి, నాలుగు సక్సెస్ ఫుల్ MQB మోడల్స్ ప్రొడక్షన్ మైల్స్టోన్ మరియు మా ఇంజిన్ షాప్ స్టాండ్ల 10 సంవత్సరాల ప్రయాణాన్ని కొనసాగించాము. ఇండియా ఆటోమోటివ్ ఇండస్ట్రీకి మరియు ఇండియాలో ఉన్న టాలెంట్ మరియు శ్రామికశక్తికి ఎస్ఎవిడబ్లూఐపిఎల్ సహకారం మా అంకితభావానికి నిదర్శనం.” అని పేర్కొన్నారు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్