- 2 వేరియంట్లలో లభ్యం
- కియా EV9తో పాటు లాంచ్ అయిన కియా కార్నివాల్
కియా ఇండియా న్యూ-జెన్ కియా కార్నివాల్ ఎంపివి ధరలను అధికారికంగా ప్రకటించింది. కార్నివాల్ ఎంపివి అనే ఈ ప్రీమియం పీపుల్ మూవర్ ఇండియాలో సరికొత్త అప్డేట్స్ తో నేడే లాంచ్ అయింది. దీనిని మీరు రూ. 63.90 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో పొందవచ్చు. అలాగే, కస్టమర్లు ఈ మోడల్ను లిమోసిన్ మరియు లిమోసిన్ ప్లస్ అనే రెండు వెర్షన్ల లోబుక్ చేసుకోవచ్చు. దీని డెలివరీలు మరికొన్ని నెలల్లో ప్రారంభం కానున్నాయి.
కియా EV9తో పాటు లాంచ్ అయిన, కార్నివాల్ ఎంపివి లుక్ ను మరింత మెరుగుపరిచేందుకు హైలైట్ అంశాలలో డ్యూయల్ సింగిల్-పేన్ ఎలక్ట్రిక్ సన్రూఫ్, ఇన్ఫోటైన్మెంట్ మరియు ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ కోసం ట్విన్ 12.3-ఇంచ్ డిస్ప్లేస్, పవర్డ్ మరియు వెంటిలేషన్ కోసం ఫ్రంట్ సీట్స్, పవర్ తో కూడిన రియర్ డోర్, బ్లైండ్ స్పాట్ మానిటర్తో 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, 12-స్పీకర్ ప్రీమియం మ్యూజిక్ సిస్టమ్ మరియు లెవల్ 2 ఏడీఏఎస్(ఎడాస్) సూట్ వంటివిఉన్నాయి.
కొత్త కార్నివాల్ ఇంటీరియర్ హైలైట్స్ లో కొత్త ఫేసియాతో కొత్త గ్రిల్, నిలువుగా అమర్చిన ఎల్ఈడీ హెడ్ల్యాంప్స్, ఇన్వర్టెడ్ ఎల్- షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, కాంట్రాస్ట్-కలర్డ్ స్కిడ్ ప్లేట్స్, టెయిల్గేట్పై ఎల్ఈడీ లైట్ బార్, కొత్త అల్లాయ్ వీల్స్, ఫ్రెష్ రూఫ్ రెయిల్స్ మరియు షార్క్ ఫిన్ యాంటెన్నా వంటివి ఉన్నాయి.
మెకానికల్గా, కొత్త కియా కార్నివాల్ లోని 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో జతచేయబడింది. ఈ మోటార్ రియర్ వీల్స్ కి పవర్ ని సప్లై చేస్తూ,197bhp మరియు 440Nm మాక్సిమం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే, ఆటోమేకర్ ఇప్పటికే ఇండియాలో కార్నివాల్ ఎంపివి ద్వారా 2,796 బుకింగ్లను నమోదు చేసింది.
అనువాదించిన వారు: రాజపుష్ప