- రూ. 75 వేల వరకు పెరిగిన ధరలు
- రూ.13.99 లక్షల నుంచి హెక్టర్ రేంజ్ ధరలు ప్రారంభం
ఇండియాలో ఎప్పటినుంచో బెస్ట్ సెల్లింగ్ మోడల్ గా విక్రయించబడుతున్న హెక్టర్ మోడల్ ధరలలో జెఎస్డబ్లూ ఎంజి మోటార్ ఇండియా మార్పులు చేసింది. దీంతో ఈ ఎస్యూవీపై భారీగా రూ.75 వేల వరకు ధరలు పెరగగా, పెరిగిన ధరలు తక్షణమే అమలులోకి వచ్చాయి. ధరలలో మార్పుల కారణంగా, హెక్టర్ మరియు హెక్టర్ ప్లస్ మోడల్స్ రెండింటిపై వరుసగా రూ.62 వేలు మరియు రూ.75 వేల వరకు ధరలు గణనీయంగా పెరిగాయి.
ప్రస్తుతం హెక్టర్ ఎస్యూవీ రూ.13.99 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. అదే విధంగా, హెక్టర్ ప్లస్ కారు రూ.17.30 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో ఇండియాలో విక్రయించబడుతుంది. ఇంకా ఈ రెండు కార్లు 9 వేరియంట్లలో అందించబడగా, అందులో స్టైల్, షైన్ ప్రో, సెలెక్ట్ ప్రో, స్మార్ట్ ప్రో, షార్ప్ ప్రో, సావీ ప్రో, బ్లాక్ స్టార్మ్, స్నోస్టార్మ్, మరియు 100-ఇయర్ ఎడిషన్ వంటివి ఉన్నాయి. వీటిలో మీకు నచ్చిన వేరియంట్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఇతర వార్తలలో చూస్తే, ఆటోమేకర్ ప్రస్తుతం విండ్సర్ ఈవీ అనే ఒక కొత్త ప్రొడక్టును దేశవ్యాప్తంగా డెలివరీ చేయడం ప్రారంభించింది. ఈ ఆల్-ఎలక్ట్రిక్ ఎంజి విండ్సర్ ఈవీ మొత్తంగా ఎక్సైట్, ఎక్స్క్లూజివ్, మరియు ఎసెన్స్ వంటి మూడు వేరియంట్లలో అందుబాటులో ఉండగా, వీటి ఎక్స్-షోరూం ధరలు రూ.9.99 లక్షలతో ప్రారంభమయ్యాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్