- అన్ని ఎఎంటి మోడల్స్ పై తగ్గిన ధరలు
- జూన్ 1, 2024నుండి అమలులోకి రానున్నమోడళ్ల తగ్గినధరలు
మారుతి సుజుకి ఇండియాలో దాని మొత్తం ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ రేంజ్ ధరలను తగ్గించింది. అన్ని ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మోడళ్లపై రూ. 5,000 వరకు ధర తగ్గగా , తగ్గిన ధరలు జూన్ 1, 2024 నుండి అమలులోకి వచ్చాయి. అదే విధంగా, ఆయా ఎఎంటి కార్ల ధరలు తగ్గినా మాన్యువల్ వెర్షన్ల ధరలలో ఎటువంటి మార్పులు లేవు.
ప్రస్తుతం, ఆల్టో K10, s-ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్ R, స్విఫ్ట్, డిజైర్, బాలెనో, ఫ్రాంక్స్ మరియు ఇగ్నిస్ ఏజీఎస్(ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ) గేర్బాక్స్తో కూడిన మోడల్స్ ఉన్నాయి.ధరల విషయానికొస్తే, మారుతి సుజుకి లైనప్లో అత్యంత చవకగా ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మోడల్ ఆల్టో K10 VXiవేరియంట్ ని, రూ. 5.56 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో పొందవచ్చు.
ఇతర వార్తలలో, మారుతి సుజుకి ఆల్టో K10, సెలెరియో మరియు s-ప్రెస్సోతో సహా దాని ఎంట్రీ-లెవల్ హ్యాచ్బ్యాక్ల 'డ్రీమ్ సిరీస్' ఎడిషన్ను ప్రారంభించేందుకు మారుతి సిద్ధమవుతోంది. ఈ కొత్త లిమిటెడ్ ఎడిషన్ మోడల్లలో మరిన్ని ఫీచర్లను అందిస్తుండగా, వీటిని రూ. 4.99 లక్షలు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో పొందవచ్చు.
అనువాదించిన వారు: రాజపుష్ప