- అక్టోబర్ 3వ తేదీ నుంచి బుకింగ్స్ ప్రారంభం
- సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభం కానున్న టెస్ట్ డ్రైవ్స్
ఇండిపెండెన్స్ డే సందర్భంగా, మహీంద్రా దాని సరికొత్త ఎస్యువి థార్ రాక్స్ ను ఇండియాలో లాంచ్ చేసింది. థార్ కొత్త ఇటరేషన్ ని రూ.12.99 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో పొందవచ్చు. ఫైవ్ –డోర్ థార్ రాక్స్ ను కొనుగోలు చేయాలని ఆసక్తి కలిగి ఉన్న కస్టమర్లు తమ సమీపంలోని డీలర్షిప్లను సందర్శించి ఎస్యువిని బుక్ చేయవచ్చు. అలాగే, ఇది ఇండియా అంతటా ఉన్న డీలర్షిప్ల వద్దకు చేరుకోవడం ప్రారంభమైంది.
మరో వైపు,ఈ మోడల్ టెస్ట్ డ్రైవ్స్ సెప్టెంబర్ 14 తర్వాత ప్రారంభం కానున్నాయి. అంతేకాకుండా, కస్టమర్లు ఎస్యూవీని అధికారికంగా అక్టోబర్ 3 నుండి బుక్ చేసుకోవచ్చు.
త్రీ-డోర్ వెర్షన్తో పోలిస్తే కొత్త థార్ రాక్స్ ఫీచర్ల పరంగా, ఎక్కువ ఫీచర్లతో ఫీచర్-రిచ్ మోడల్ గా వచ్చింది. రాక్స్ టాప్-స్పెక్ వేరియంట్ లో పెద్ద పనోరమిక్ సన్రూఫ్, లెవెల్ 2 ఏడీఏఎస్(ఎడాస్) సూట్, పెద్ద ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్, వైర్లెస్ ఛార్జర్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా మరియు ప్రీమియం మ్యూజిక్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
మెకానికల్గా, ఫైవ్- డోర్ థార్ రాక్స్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్స్ తో 2.0-లీటర్ టిజిడిఐ పెట్రోల్ మరియు 2.2-లీటర్ సిఆర్ డిఐ డీజిల్ ఇంజిన్ని పొందింది. ముఖ్యంగా చెప్పాలంటే, ఆర్డబ్ల్యూడి వెర్షన్ల ధరలు వెల్లడవ్వగా, థార్ రాక్స్ 4x4 వేరియంట్ల ధర బుకింగ్స్ ప్రారంభమయ్యే రోజున మహీంద్రా కంపెనీ వెల్లడించనుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప