- రూ.1.75 లక్షల వరకు లభిస్తున్న ఆఫర్లు
- ఫైవ్-డోర్ థార్ రాక్స్ పై మరింత ఆకర్షణను పెంచే యోచనలో డీలర్ షిప్స్
మహీంద్రా కంపెనీ లేటెస్టుగా ఈ సంవత్సరంలో అతి పెద్ద లాంచ్ గా పేర్కొనే ఫైవ్-డోర్ థార్ రాక్స్ ని లాంచ్ చేసింది. ఈ కొత్త లైఫ్ స్టైల్ ఆఫ్-రోడర్ బుకింగ్స్ ప్రారంభమైన ఒక్క గంటలోనే 1.76 లక్షలకు పైగా బుకింగ్స్ అందుకొని అతిపెద్ద సక్సెస్ ని రిజిస్టర్ చేసింది. ఇప్పుడు, థార్ రాక్స్ భారీ సక్సెస్ ని అందుకున్న తర్వాత, త్రీ-డోర్ వెర్షన్ పై డిమాండ్ గణనీయంగా తగ్గింది.
మాకు అందిన సమాచారం ప్రకారం, దేశవ్యాప్తంగా ఉన్న మహీంద్రా డీలర్ షిప్స్ దసరా మరియు దీపావళి పండుగా సీజన్ సందర్భంగా త్రీ-డోర్ థార్ లోని సెలెక్టెడ్ వేరియంట్లపై రూ.1.75 లక్షల వరకు భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే, థార్ ఎస్యూవీలోని అన్నీ వెర్షన్లపై వెయిటింగ్ పీరియడ్ కూడా చాలా వరకు తగ్గింది.
స్టాండర్డ్ త్రీ-డోర్ థార్ తో పోలిస్తే, థార్ రాక్స్ మోడల్ కస్టమర్ల నుంచి అద్బుత స్పందనను అందుకుంది. ప్రస్తుతం, స్టాండర్డ్ థార్ కారును రూ.11.35 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో పొందవచ్చు. అదేవిధంగా, టాప్-స్పెక్ 4x4 వెర్షన్ కారు ఇండియాలో రూ.17.60 లక్షల ఎక్స్-షోరూం ధరతో విక్రయించబడుతుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్