- విక్రయంలో ఉన్న ఒకే ఒక్క మహీంద్రా ఎంపివి
- సెప్టెంబర్-2018లో లాంచ్ అయిన మరాజో మోడల్
మహీంద్రా నుంచి వచ్చిన మరాజో కారు అతి తక్కువగా అమ్ముడుపోతుండగా, లేటెస్టుగా దాని అధికారిక వెబ్ సైట్ నుంచి మరాజో ఎంపివిని తొలగించింది. ఏడేళ్ళ వరకు సర్వీసును అందించిన మూడు-వరుసల ప్యాసింజర్ వెహికిల్ కి ప్రస్తుతం మహీంద్రా స్వస్తి పలికింది. ఈ మోడల్ 2018 లాంచ్ కాగా, అప్పటినుంచి ఇప్పటి వరకు ఈ మోడల్ ఒక్క అప్ డేట్ ని కూడా అందుకోలేదు.
మహీంద్రా మరాజో రూ. 9.99 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో లాంచ్ చేయబడింది. అదే విధంగా, దీని టాప్-స్పెక్ వెర్షన్ రూ. 13.90 లక్షల ఎక్స్-షోరూం ధరతో విక్రయించబడింది. దీని లాంచ్ తర్వాత వెంటనే దీని ధరకు సంబంధించిన అనాలిసిస్ కూడా మేము చేశాము.
మరాజో లాంచ్ తర్వాత మహీంద్రా కంపెనీ నెలకు సగటున 5,000 మరాజో యూనిట్లను విక్రయించింది. కానీ, సంవత్సరాలు గడుస్తున్న కొలది దీని కథ మరీ అంతగా సాగలేదు. గత సంవత్సరం జూన్ నెలలో మరాజో ఏడాది పూర్తి సేల్స్ పరిశీలిస్తే, ఆటోమేకర్ కేవలం సగటున నెలకు కేవలం 55-60 యూనిట్లు మాత్రమే విక్రయించింది.
మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, లాంచ్ సమయంలో మరాజో ఎంపివి మాన్యువల్ గేర్ బాక్సుతో రాగా, త్వరలో ఆటోమేటిక్ వెర్షన్ కూడా వస్తుందని అందరూ అనుకున్నారు. అయితే, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లో మరాజో ఇండియన్ మార్కెట్లోకి రాకపోగా, కేవలం మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో మాత్రమే కొనసాగింది.
మెకానికల్ గా, మరాజో బిఎస్-6 అప్ డేటెడ్ 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ తో రాగా, ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్సుతో జతచేయబడి 121bhp మరియు 300Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇంకా చెప్పాలంటే, చివరిగా ఈ మోడల్ రూ. 14.39 లక్షల నుంచి రూ. 16.80 లక్షల (రెండూ ఎక్స్-షోరూం ధరలు) ధరతో విక్రయించబడింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్