- ఇండియన్ మార్కెట్లో 59 నెలల్లోనేఈప్రొడక్షన్ మైలురాయిని అధిగమించిన కియా
- మొత్తం అమ్మకాలలో 48 శాతానికి పైగాసెల్టోస్ షేర్
కియా ఇండియా ఇండియాలో దాని 5వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఇది సాధించిన భారీ మైలురాయిని ప్రకటించింది.అలాగే, ఇండియాలో కొరియన్ ఆటోమేకర్ కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత కేవలం 59 నెలల్లోనే 10 లక్షల యూనిట్ల విక్రయాలను అధిగమించింది.
ఆటోమేకర్ ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత కియా సెల్టోస్ మోడల్ మొత్తం అమ్మకాలలో 48 శాతానికి పైగా అమ్మకాలను పొందింది. ఇదిలా ఉండగా, సోనెట్ మరియు కారెన్స్ వరుసగా 34 శాతం మరియు 16 శాతంవిక్రయాలు అమ్మకాలపై సహకారంఅందించాయి అని కియా పేర్కొంది. ప్రస్తుతం,ఈ బ్రాండ్ఇండియా లో సోనెట్, సెల్టోస్, కారెన్స్ మరియు EV6తో కలిపి 4 మోడళ్లను కలిగి ఉంది. అయితే, త్వరలో కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ కియా క్లావిస్ ని కూడా ఈ లైనప్లో చేర్చనుంది. ఇది ఈ ఏడాది చివర్లో దాని అరంగేట్రం చేయనుండగా, 2025 ప్రారంభంలో లాంచ్కి సిద్ధంగా ఉంది.
ఈ మైలురాయిపై కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ జున్సు చో మాట్లాడుతూ, 'రికార్డ్ సమయంలో లాంచ్ అయినప్పటి నుండి మేము నిరంతరం దీని పై మైలురాళ్లను సాధిస్తున్నాము. మీరు ఈ దేశంలో అడుగడుగునా వైవిధ్యాన్ని ఎదుర్కొన్నప్పుడు మరియు దశాబ్దానికి పైగా అనుభవం ఉన్న లెగసీ ప్లేయర్ల నుండి పోటీని ఎదుర్కొన్నప్పుడు ఈ మైలురాళ్లు మరింత ముఖ్యమైన అంశాలలో ఒకటిగా మారాలని, 10 లక్షల దేశీయ మార్కెట్ లో ఇంతకు ఇంత అమ్మకాలను సాధించడం ఇండియన్ మార్కెట్పై మా నిరంతర దృష్టి మరియు ఇండియన్ కస్టమర్ల అవసరాల అంతరానికి నిదర్శనం ఉండాలని, మా బ్రాండ్పై నమ్మకాన్ని ప్రదర్శించి, దేశంలో అత్యంత ఇష్టపడే కార్ల కార్మేకర్లో ఒకరిగా మమ్మల్ని తీర్చిదిద్దిన మా కస్టమర్లందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.' తెలియజేసారు.
అనువాదించిన వారు: రాజపుష్ప