- కేవలం 100 యూనిట్లను మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చిన సిట్రోన్
- 18వ తేదీ జూన్ అనగా నేటి నుంచే బుకింగ్స్ ప్రారంభం
C3 ఎయిర్ క్రాస్ మోడల్ లో ఒక కొత్త డెరివేటివ్ (వేరియంట్)ని సిట్రోన్ ఇండియా రూ. 11.82 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. దానికి సిట్రోన్ కంపెనీ ఒక పేరును కూడా పెట్టింది, అదేంటి అంటే ధోని ఎడిషన్. ఈ పేరును కంపెనీ ఎందుకు పెట్టింది అంటే, తాజాగా సిట్రోన్ కంపెనీ ఇండియన్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనిని తమ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. మీ అందరికీ ఇది వరకే తెలిసే ఉంటుంది ఇండియాలో క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనికి ఎంత క్రేజ్ ఉందో. దేశవ్యాప్తంగా ధోనికి కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగాC3 ఎయిర్ క్రాస్ ధోని ఎడిషన్ గురించి చెప్పాలంటే, దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలో కేవలం 100 యూనిట్లను మాత్రమే కంపెనీ తీసుకురానుంది.
కొత్త C3 ఎయిర్ క్రాస్ ధోని ఎడిషన్లో మీకు లభించే హైలైట్ ఫీచర్లలో ‘Dhoni’ డీకాల్స్, కలర్ కో-ఆర్డినేటెడ్ సీట్ కవర్లు మరియు కుషన్లు, సీట్ బెల్ట్ కుషన్, ఫ్రంట్ డ్యాష్ క్యామ్, మరియు ఇల్యూమినేటెడ్ సిల్ ప్లేట్స్ వంటి బెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, కస్టమర్ ప్రతి యూనిట్ కొనుగోలు ద్వారా గ్లోవ్ బాక్స్ వంటి స్పెషల్ యాక్సెసరీస్ పొందనుండగా, ఆ గ్లోవ్స్ పై క్రికెటర్ ఎంఎస్ ధోని సిగ్నేచర్ ఉండనుంది.
ఈ సందర్భంగా సిట్రోన్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ శిశిర్ మిశ్రా మాట్లాడుతూ, “C3 ఎయిర్క్రాస్ స్పెషల్ ధోనీ ఎడిషన్ను పరిమితంగా కేవలం 100 యూనిట్ల మాత్రమే ఆవిష్కరించడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా బ్రాండ్ అంబాసిడర్ ధోని లీడర్ షిప్, మరియు ఎక్సలెన్స్, బెస్ట్ ఎక్స్ పీరియన్స్ సిట్రోన్ కంపెనీని ఎంతగానో సహాయపడుతుంది. క్రికెటర్ ధోని లెజెండరీ జర్నీకి అపూర్వమైన నివాళిగా ఈ అరుదైన, లిమిటెడ్ ఎడిషన్ ని తీసుకువచ్చాం, ఇది ఆటోమోటివ్ హిస్టరీలో ఒక భాగంగా నిలిచిపోనుంది. అలాగే ధోని ఫ్యాన్స్ కూడా ఎంతో సంతోషిస్తారు.” అని పేర్కొన్నారు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్