- రెండు శాతం వరకు పెరగనున్న ఆడి కార్ల ధరలు
- ధరలు పెరగడానికి కారణం ఇన్పుట్ ఖర్చులేనని తెలిపిన ఆడి ఇండియా
ప్రస్తుతం ఇన్పుట్ ఖర్చులు మరియు రవాణా ఖర్చులు పెరగడంతో మోడల్ రేంజ్ లో ఉన్న అన్ని కార్ల ధరలు రెండు శాతం మేర పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది. ఆయా మోడల్స్ పై పెరిగిన ధర జూన్ 1వ తేదీ, 2024 నుంచి అమలులోకి వస్తుంది కంపెనీ పేర్కొంది.
ఇతర వార్తలలో చూస్తే, 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆడి ఇండియా మొత్తం 7,027 యూనిట్లను విక్రయించి, ఓవరాల్ గా 33 శాతం వృద్ధిరేటును సాధించింది. అదే విధంగా, ఇదే పీరియడ్ లో ప్రీ-ఓన్డ్ కార్ బిజినెస్ 50 శాతం మేర పెరిగినట్లు ఆడి ఇండియా నిర్ధారించింది.
ప్రస్తుతం ఆడి ఇండియా ప్రొడక్ట్ రేంజ్ లో A4, A6, A8 L, Q3, Q3 స్పోర్ట్ బ్యాక్, Q5, Q7, Q8, S5 స్పోర్ట్ బ్యాక్, RS5 స్పోర్ట్ బ్యాక్, RS Q8, Q8 50-ఇ-ట్రాన్, Q855 ఇ-ట్రాన్, Q8 స్పోర్ట్ బ్యాక్ 50- ఇ-ట్రాన్, Q8 స్పోర్ట్ బ్యాక్ 55 ఇ-ట్రాన్, ఇ-ట్రాన్ GT, మరియు ఆడి RS ఇ-ట్రాన్ GT వంటి లగ్జరీ మోడల్స్ ఉన్నాయి.
పెరిగిన ధరల గురించి ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ దిల్లోన్ మాట్లాడుతూ “ఇన్పుట్ ఖర్చులు పెరగడంతో రెండు శాతం వరకు ధరలను జూన్ 1వ తేదీ, 2024 నుంచి ధరలను పెంచాల్సి వచ్చింది. ధరలను సరిదిద్దడం ద్వారా ఆడి ఇండియా మరియు డీలర్ పార్టనర్ల వృద్ధి లక్ష్యం మరింత పెరగవచ్చు. ఎప్పటిలాగే, పెరుగుతున్న ఖర్చుల భారం మా కస్టమర్లపై పడకుండా వీలైనంత వీటిని తక్కువగా ఉంచాలన్నదే మా ప్రయత్నం” అని పేర్కొన్నారు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్