- ఢిల్లీలోని రెండు ప్రాంతాలు ఎంపిక
- ఛార్జింగ్ సౌకర్యాలతో అందుబాటులోకి రానున్న 3ఎస్ మోడల్
టాటా మోటార్స్ ఇండియాలో తన ఎలక్ట్రిక్ కార్ ప్లాన్స్ కి సంబంధించి మరో అడుగు ముందుకు వేసింది మరియు కేంద్ర పాలిత రాష్ట్రం(ఎన్సిఆర్) ఢిల్లీలో తన మొదటి రెండు ఈవీ షోరూంలను ప్రారంభించనుంది. దీని కోసం ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతుండగా మొత్తానికి వచ్చే సంవత్సరం చివరికల్లా టైర్-1లో ఉన్న అన్నీ పెద్ద నగరాలకు ఈవీ షోరూంలను విస్తరించనున్నారు. గమనించాల్సిన అంశం ఏమిటంటే ఈ ఈవీ షోరూంలలో కేవలం ఎలక్ట్రిక్ వెహికిల్స్ మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.
ఈ ఈవీ షోరూంలు అన్ని ఆటోమేకర్ టాటా.ఈవీ కిందికి రానున్నాయి మరియు ప్రస్తుతం ఈవీలతో పాటుగా ఉన్న కార్ల షోరూంలతో పోలిస్తే ఇవి కొత్త డిజైన్, కలర్ స్కీం, మరియు లేఅవుట్ కలిగి ఉండనున్నాయి. లొకేషన్ ఆధారంగా, ఈ సౌకర్యాలు 3ఎస్ సెటప్తో పాటు డిసి ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని కూడా అందించనున్నాయి.
టాటా బ్రాండ్ తన ఈవీ లైనప్ ను 2024లో మరింత విస్తరించనుంది.నెక్సాన్ ఈవీ, టియాగో ఈవీ మరియు టిగోర్ ఈవీలు పంచ్ ఈవీ మరియు కర్వ్ ఈవీలతో పాటుగా చేరనున్నాయి. హారియర్/సఫారి ఈవీ మరియు సియెర్రా ఈవీలను కూడా 2024లో ఆవిష్కరించి, 2025 ప్రారంభంలో లాంచ్ చేయవచ్చని మేము అంచనా వేస్తున్నాము.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్